వికారాబాద్, సెప్టెంబర్12 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ బీఆర్ఎస్పార్టీ జిల్లా కార్యాలయంలో మండల ఎస్సీసెల్ అధ్యక్షులు, సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రణాళికా బద్ధంగా, సమన్వయంతో పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పడిగళ్ళ అశోక్, జనరల్ సెక్రెటరీ శివకుమార్, మైనార్టీ విభాగం అధ్యక్షులు గయాజ్, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, నాయకులు మల్లికార్జున్ , మండలంలోని గ్రామాల ఎస్సీ సెల్ అధ్యక్షులు పాల్గొన్నారు.