వికారాబాద్ : వికారాబాద్లో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న మృదుల అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శుక్రవారం ఆసుపత్రికి చేరుకొని స్వయంగా పరీక్షించి త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడి త్వరగా కోలుకునేల వైద్య సేవలు అందించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ముద్ద భక్తవత్సలం, డాక్టర్ పవన్కుమార్లు ఉన్నారు.