తాండూరు రూరల్, జూలై 20 : సమాజంలో అట్టడుగులో ఉన్న దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ఏసు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన టెంట్ హౌజ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం రూ.10 లక్షలు మంజూరు చేయలేదన్నారు. కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే దళితుల అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో సర్పంచ్ రాములు, వైస్ చైర్మన్ దీప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, నియోజకర్గ టీఆర్ఎస్ మహిళా విభాగం కన్వీనర్ శకుంతల దేశ్పాండే, తదితరులు ఉన్నారు.