ధారూరు, మార్చి 17 : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారూరు మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చేసుకుంటామన్నారు.
కార్యక్రమంలో ధారూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శి రాజుగుప్త, మాజీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు సోప్పరి వెంకటయ్య, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేశం, మండల బిసి సెల్ అధ్యక్షుడు యాదయ్య, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు దేవేందర్, మండల ఎస్సీ సెల్ సోషల్ మీడియా ఉపాధ్యాక్షుడు విజయ్కుమార్,తరిగోపుల సర్పంచ్ విశాల వెంకట్ రామ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.