మర్పల్లి, ఆగస్టు 4 : వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ప్రజలకు సూచించారు. గురువారం మర్పల్లి మండలం షాపూర్తండాలో మీతో-నేను కార్యక్రమంలో భాగంగా తండాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామంలో మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులకు రూ.5 లక్షల నిధులు మంజూరు చేస్తామన్నారు. వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాలీబాయి, ఎంపీటీసీ శ్రీవిద్య, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, పాల్గొన్నారు.