వికారాబాద్ : యువత క్రీడల్లో ప్రతిభను కనబర్చి ప్రాంతానికి మంచి పేరు ప్రక్యాతలు తీసుకరావాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో వీడీసీ (వికారాబాద్ డిస్టిక్ క్రికెట్) వారు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్, టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, ఎమ్మెల్యే ఆనంద్లు బమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు స్నేహాభావం పెంపొందుతాయన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుందని, దానిని బయటకు తీసినప్పుడే గుర్తింపు వస్తుందని తెలిపారు. విద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకొని రానించాలన్నారు.
క్రీడల్లో ఓడిన వారు నిరుత్సాహపడకుండా, ప్రతిభను మెరుగు పర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్ అనంత్రెడ్డి, వీడీడీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, నాయకులు సుభాన్రెడ్డి, షఫీ, క్రీడాకారులు పాల్గొన్నారు.