కోట్పల్లి : పేదింటి మహిళలకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని రాంపూర్ రైతువేదికలో 20మంది లబ్ధిదారులకు రూ. 20,22,320 లక్షల విలువ చేసే 20 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ పిల్లలుంటే భారంగా భావించే పేదింటి కుటుంబాల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం లక్షానూటపదహార్లు ఇచ్చి కుటుంబంలో పెద్దన్నలా భరోసా ఇస్తుండన్నారు. దీంతో పేదింటి కుటుంబాల్లో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అనిల్కుమార్, మండల రైతబంధు అధ్యక్షుడు సత్యం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.