తాండూరు : ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధి నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలోని 5మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 11.25లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ సీనియర్ యువనాయకుడు శెట్టి అమిత్ కుటుంబ సభ్యులను పరమర్శించి రూ. 6లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మృతుడి భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు.
అమిత్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఇద్దరు అమ్మాయిలకు కావాల్సి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, టీఆర్ఎస్ నేతలు లక్ష్మారెడ్డి, నారా మహిపాల్రెడ్డి, కరుణం పురుషోత్తంరావు, రవిగౌడ్, అబ్దుల్ రావుఫ్, సిద్రాల శ్రీనివాస్, పట్లోళ్ల నర్సింలు ఉన్నారు.