ముంబై : డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని రూ.10.74 కోట్లు మోసం చేసిన ఇన్ఫ్లూయెన్సర్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో పుణెకు చెందిన ఓ వృద్ధుడికి కొందరు సీబీఐ అధికారులం అంటూ పరిచయం అయ్యారు.
‘నీ మీద ఓ కేసు ఉంది. దాని నుంచి తప్పించాలంటే మేం చెప్పిన బ్యాంకులకు డబ్బు బదిలీ చేయాలి’ అని వాళ్లు చెప్పడంతో అతను నమ్మి రూ.10.74 కోట్లు వాళ్లు చెప్పిన ఖాతాలకు మళ్లించాడు. తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ముఠాలో ఒకతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఆ డబ్బును సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రోహన్ జాదవ్కు ఇచ్చినట్టు తెలిపాడు. రోహన్ నేతృత్వంలోనే ఈ ప్లాన్ వేసినట్టు దర్యాప్తులో తేలింది. రోహన్ ఆ డబ్బు మొత్తాన్ని 5,436 బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు పోలీసులు గుర్తించారు.