న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాందేడ్లోగల ఒక గురుద్వారలో శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై గురువారం ఒక పదునైన ఆయుధంతో దాడి జరిగింది. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో బాదల్పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురుద్వారాను సందర్శించిన బాదల్పై నిహంగ్ జస్పాల్ సింగ్ తేజ్పాల్ అనే వ్యక్తి దాడి చేశాడు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బాదల్ కుడి చేతికి స్వల్ప గాయమైంది. యశోసాయి దవాఖానలో చికిత్స పొందుతున్న బాదల్కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. బాదల్ భద్రత కోసం ఏర్పాటుచేసిన ఇన్స్పెక్టర్ సంతోష్ కెండ్రె దాడి నుంచి బాదల్ను రక్షించే ప్రయత్నంలో స్వల్పంగా గాయపడ్డారు.