వికారాబాద్ : ద్విచక్ర వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు వికారాబాద్ అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయంలో ద్విచక్ర వాహనాల దొంగల వివరాలు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ధారూరు మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన కమ్మరి సునీల్ వయస్సు 26, తాండూరులోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన కమ్మరి ఆకాశ్ (22) వీరు వృత్తిరీత్య కూలీ పనులు చేసేవారన్నారు. జల్సాలకు, విలాసాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశంతో ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేయడం ప్రారంభించారు.
మోమిన్పేట, బీడీఎల్ బానుర్, తాండూరు, జహీరాబాద్, కరణ్కోట్, మలికేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఒక్కొక్కటీ చొప్పున బైక్లు దొంగలించబడ్డాయ న్నారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 3, కర్నాటక రాష్ట్రంలోని ముందోల్ పోలీస్ పరిధిలో 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు తెలిపారు. ఈ ద్విచక్ర వాహనాలను వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన ఆశమ్మోల్ల రవికుమార్ అలియాస్ శివమణి శివకు తక్కువ ధరలకు అమ్ముకొని, వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారన్నారు. వీరి ముగ్గురిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం జరిగిందని తెలిపారు.
గతంలో కమ్మరి సునీల్పై మియాపూర్, ఎల్బీనగర్, నందిగామ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై నేర చరిత్ర ఉందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ఫోర్సు పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఫిబ్రవరి 10, 2022న మోమిన్పేట ఎక్స్రోడ్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు గతంలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని సుమారు 11 మోటర్ సైకిళ్లను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. కార్యక్రమంలో మోమిన్పేట సీఐ వెంకటేశం, ఎస్సై విజయ్ ప్రకాష్, టాస్క్ఫోర్స్ పోలీసులు ఉన్నారు.