పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలోని తమ నివాసంలో 22మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 16.03లక్షలకు సంబంధించిన చెక్కులు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానలో చికిత్సలు పొందిన వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందుతుందని చెప్పారు. ప్రతి పేదవారికి ఏదో రకంగా సహాయం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి పేదల సంక్షేమమే ధ్యేయంగా సర్కారు పని చేస్తుందన్నారు.
కార్యక్రమంలో పరిగి, పూడూరు ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, మార్కెట్ చైర్మన్ అంతిగారి సురేందర్, పరిగి పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పూడూరు మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, సర్పంచ్లు నల్క జగన్, వెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్రెడ్డి పాల్గొన్నారు.