వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలకు నిలయంగా మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. 35,04,060లు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బిడ్డ పురుడు పోసుకున్నప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తూ, తెలంగాణ రాష్ట్రం అంటేనే సంక్షేమానికి నిలయంగా మారిందన్నారు. తెలంగాణలో ఏ ఇంట్లో ఆడ బిడ్డ పెళ్లి జరిగిన ప్రభుత్వ సాకారం ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని వివరించారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, నవీన్కుమార్, కృష్ణ, నాయకులు లక్ష్మణ్, సుభాష్, షఫీ, సాయికృష్ణ ఉన్నారు.