పరిగి : కులాంతర వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారు ఇబ్బందులకు గురికాకుండా ఆర్థికంగా తమకాళ్లపై తాము నిలబడేందుకు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తుంది. గతంలో నామమాత్రంగా ఉన్న ప్రోత్సాహకాన్ని సీఎం కేసీఆర్ రూ. 2.50 లక్షలకు పెంచారు. తద్వారా ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహకాలతో ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు, చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేందుకు దోహదపడుతుంది.
వికారాబాద్ జిల్లా పరిధిలో 59మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోగా 17మందికి డబ్బులు రూ. 42.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆయా జంటలకు డబ్బులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ పేపర్లు సంబంధిత అధికారులు అందజేయడం జరుగుతుంది.