తాండూరు : పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీగార్డెన్లో నియోజకవర్గంలోని 123 గ్రామ పంచాయతీలకు ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కల్యాణ్ యోజన ద్వారా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఫాగింగ్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కంటే ముందు పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ మురుగు, చెత్త ఉండడంతో చాల అపరిశుభ్రంగా కనిపించేవన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి, హరితహారంతో పల్లెలు పరిశుభ్రంగ కనిసిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాండూరు నియోజకవర్గంలోని 143 గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్ మిషన్లను అందజేసిన ఘనత ఎమ్మెల్యే రోహిత్రెడ్డికే దక్కుతుందని అభినందించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రామాల్లో ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల చివరి వరకు ప్రతి పంచాయతిలో 100 శాతం వ్యాక్సిన్ పూర్తికావాలని ఆదేశాలు జారి చేశారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, సురభి వాణీ దేవి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనం కోసం గ్రామాలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రిమికీటకాల నివారణకు గ్రామాలకు ఫాగింగ్ మిషన్ను అందజేయడం జరుగుతుందని తెలుపుతూ ప్రతి ఒక్కరూ మిషన్ను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి మాట్లాడుతూ పల్లెల్లోని ప్రజలు ఆరోగ్యంతో పాటు సంతోషంగా ఉండాలని పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిల్లోని ప్రతి గ్రామ పంచాయతికి ఫాగింగ్ మిషన్ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషన్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో అశోక్కుమార్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, యాలాల ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, తాండూరు జడ్పీటీసీ గౌడి మంజుల, బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు, కార్యదర్శులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.