వికారాబాద్ : పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపైన ఉండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగితే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుట్కా అక్రమ రవాణా, జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలపై చర్యలు తీసుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట పరిగి డీఎస్పీ శ్రీనివాసులు, పరిగి సీఐ వెంకటరామయ్య, ఎస్సై శ్రీశైలం, సిబ్బంది ఉన్నారు.