వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వ్యవసాయ రంగం, వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. వివిధ వ్యవసాయ మార్కెట్లలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని వినతి పత్రాన్ని అందించి మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
కౌన్సిలర్ను పరామర్శించిన ఎమ్మెల్యే..
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు మద్గుల్ చిట్టంపల్లి కౌన్సిలర్ గోపాల్ హైదరాబాద్లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మోకాలికి సర్జరీ జరుగడంతో ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి కౌన్సిలర్ను పరామర్శించారు.
ధ్యాచారంలో విద్యుత్ పనులు..
గత కొన్ని రోజుల క్రితం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండలం ధ్యాచారం గ్రామంలో పర్యటించారు. విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల విద్యుత్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ధ్యాచారంలో విద్యుత్ పనులు ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.