వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో గురువారం కాలనీవాసులు ఊరడమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. జాతర జరిపించడం వల్ల ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకం. గ్రామ దేవతైన ఊరడమ్మకు ఘనంగా పూజలు చేశారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు డప్పు వాయిద్యాలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాల ఊరేగింపుతో ఆలయం వరకు చేరుకొని ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.
ఈ పూజ కార్యక్రమాలకు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే ఆనంద్ను సన్మానించారు. వీరితో పాటు కాలనీ వాసులు పార్టీ నాయకులు ఉన్నారు.