వికారాబాద్ : వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 16మంది ప్రయాణిస్తున్న వ్యాన్ బుధవారం తెల్లవారు జామున తోల్కట్ట వద్ద ప్రమాదానికి గురైన సంఘటన పాఠకులకు తెలిసిందే. గాయపడ్డ వారిని హైదరాబాద్లోని ఆలీవ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి గాయపడ్డవారిని పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ. లక్ష అందజేశారు.
మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులను ఒదార్చి ధైర్యం చెప్పారు. ఎంపీ వెంట మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్, గ్రామస్తులు ఉన్నారు.