వికారాబాద్ : తెరాస పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యేలతో కలిసి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డికి కేసీఆర్ తరపున నామినేషన్ దాఖలు చేశారు.