పరిగి : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ను కలిశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మొక్కను అందజేయడంతో పాటు తనను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మెతుకు ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించినందున జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని అన్నారు. సీఎంను కలిసిన వారిలో యువ నాయకుడు కార్తీక్రెడ్డి ఉన్నారు.