పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలో గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వెంకట్రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిగి నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మేలు చేకూరుతుందని తెలిపారు.
రాబోయే రోజుల్లో టీఆర్ఎస్లోకి మరిన్ని వలసలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెన్నాచేడ్ గ్రామానికి చెందిన లంగరి లింగప్ప, చెన్నప్ప, వెంకటయ్య, చెంద్రయ్య, దొడ్డె కృష్ణయ్య, ఇంటెన్కి వెంకటయ్య, ఇక్కి బాలకిష్టయ్య, నంచర్ల చెన్నయ్య, బుడ్డయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు.