వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శనివారం మధ్యాహ్నం చిరుజల్లుల తో ప్రారంభమై భారీ వర్షం కురిసింది. దాదాపు 2, 3 గంటలు ఏకదాటిగా వర్షం కురువడంతో కుంటలు, చెరువులు వర్షపు నీటితో నిండి పొంగి పొర్లుతున్నాయి. వికారాబాద్ పట్టణంలోని గెరిగెట్పల్లికి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి కింది నుంచి భారీగా వరద నీరు పారుతుంది. ధన్నారం సమీపంలో రోడ్డుపై నుంచి వర్షపు నీరు భారీగా పారింది. మండల పరిధిలోని సిద్ధులూర్, పులుసుమామిడి గ్రామాల వద్ద ఉన్న వాగులు వరద నీటితో ఉధృతంగా పారాయి. అటుగా వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు.
నియోజకవర్గంలోని వికారాబాద్, ధారూరు, బంట్వారంతో పాటు తదితర మండలాల్లో వర్షం కురిసింది. కురిసిన వర్షానికి చెరువులు, కుంటల్లో వరద నీరు చేరింది. వర్షంతో కూరగాయ పంటలకు కొంత మేర నష్టం కలిగినట్లు రైతులు తెలిపారు.