పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని తమ నివాసంలో పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, గండీడ్, పూడూరు మండలాలకు చెందిన 107 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ. 67. 54 లక్షలకు సంబంధించిన చెక్కులు, ఇద్దరికి ఎల్వోసీలు రూ. 5.50లక్షలకు సంబంధించినవి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సర్కారు ద్వారా సహాయం అందుతుందని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, సర్పంచ్లు నల్క జగన్, వెంకటయ్య పాల్గొన్నారు.