వికారాబాద్ : వ్యవసాయానికి చేయుతనిచ్చి రైతులను నిలబెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో సాగునీటి వసతి కల్పన, వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలతో వ్యవసాయ రంగ స్వరూపం మారిందని తెలిపారు. రైతు బీమా, ఉచిత కరెంట్, సాగు నీరు, రైతుబంధు వంటి పథకాలు అమలు కోసం ఏటా రూ. 60వేల కోట్లు ఈ రంగానికి ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే అని కొనియాడారు.
రైతుబంధు పథకం దేశంలో చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తహర్షరీఫ్, కౌన్సిలర్ అనంత్రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.