వికారాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని 13, 14, 22 వార్డుల్లో టీఆర్ఎస్ వార్డు కమిటీలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టతకు పాడు పడాలని కోరారు. వార్డులతో పాటు గ్రామ కమిటీలు, మండల, మున్సిపల్ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం పట్టణంలోని ఆలంపల్లి అనంతపద్మనాభా స్వామి దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుడికి మున్సిపల్ చైర్పర్సన్ మంజులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు కిరణ్పటేల్, అనంత్రెడ్డి, నాయకులు లక్ష్మణ్, సుభాన్రెడ్డి, గిరీష్కొఠారీ, మోముళ్ల రాజ్కుమార్ పాల్గొన్నారు.