KCR | ఫోన్ ట్యాపింగ్ పరిపాలనా పరమైన అంశం మాత్రమేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సమాచారం ఎలా సేకరించారో అధికారులు చెప్పరని మంగళవారం టీవీ9 లైవ్ షోలో కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ఇమేజ్ను ఎవరూ డ్యామేజ్ చేయలేరని వెల్లడించారు. కొందరు అధికారులు చేసే దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ తీసుకుని చేస్తారని కేసీఆర్ చెప్పారు. వివిధ పథకాలపై, ప్రభుత్వ పనితీరుపై ముఖ్యమంత్రులుగా మేం ప్రజాభిప్రాయాన్ని నిఘా అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటాం అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని సీఎం, మంత్రులు చెప్పరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సీఎంకు సంబంధం లేని వ్యవహారం, అసలు ఇది అనవసరం అని పేర్కొన్నారు. నిఘా వ్యవస్థల్లేకుండా ప్రభుత్వాలు ఉంటాయా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. అన్ని స్థాయిలలో నిఘా కోసం విభాగాలు ఉంటాయని చెప్పారు.