కొట్పల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బర్వాద్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఆరుట్ల రాంచంద్రారెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశం, ఆయా గ్రామాల అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.