పరిగి టౌన్ : ఆన్లైన్ మోసాలకు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలని ఎస్సై విఠల్రెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని చిట్యాల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నెట్ వాడకం వల్ల అపరిచితులు ఫేక్ మెసేజ్లు పంపడం వల్ల వాటికి విద్యార్థులు రెస్పాన్స్ కావద్దని అపరిచిత వ్యక్తులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజితారెడ్డి, ఎంఈఓ హరిశ్చందర్నాయక్, హెచ్ఎం వెంకట్, స్కూల్ కాంప్లెక్స్ కార్యదర్శి ఉస్మాన్అలీ, ఎస్ఎంసీ చైర్మన్లు శారద, కృష్ణా పాల్గొన్నారు.