‘వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదు.. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించండి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం జినుగుర్తి గేటు సమీపంలో జరిగిన తాండూరు మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాండూరు పక్కనే ఉన్న కర్ణాటకలో ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు పట్టుగొమ్మలని, వారిని అన్నివిధాలుగా పార్టీ ఆదుకుంటుందన్నారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదన్నారు. మాడ్గుల మండలంలోని ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
– తాండూరు, ఏప్రిల్ 7/మాడ్గుల
తాండూరు, ఏప్రిల్ 7 : వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదని.. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాందాస్ నేతృత్వంలో తాండూరు మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం జినుగుర్తి గేటు సమీపంలో ఘనంగా జరిగింది. దీనికి 33 గ్రామపంచాయతీల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బ్యాం డ్లు, డప్పుల దరువులతో టపాకులు కాలుస్తూ తరలివచ్చారు. కళాకారుల ఆటాపాటలు, కార్యకర్తల ఉత్సా హం, గిరిజన మహిళల నృత్యాలు, గులాబీ శ్రేణుల నినాదాలు, ప్రజాప్రతినిధుల మాటలతో ఆత్మీయ సమ్మేళనం ఆకట్టుకున్నది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రాణాలు లెక్కచేయకుండా.. కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.. సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని.. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తాండూరు పక్కనే ఉన్న కర్ణాటకలో ప్రజా సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. పదోతరగతి పరీక్ష పత్రాన్ని పథకం ప్రకారం వాట్సాప్లో సర్క్యులేట్ చేసి పిల్ల ల జీవితాలతో ఆడుకోవాలని చూసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో కుట్రలను బయటపెట్టి అందుకు కారకులైన వారిని జైల్లో పెట్టడంతో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులను తీసుకొచ్చి తాండూరును ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలన్నారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా నిలిచిందన్నారు. రంగారెడ్డి-పాలమూరు రెండో విడుతలో తాండూరు ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్నారు.
గడప గడపకూ సంక్షేమ పథకాలు
అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణలో గడపగడపకూ సంక్షేమ పథకాలను అందిస్తు న్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నా రు. మహిళల కష్టాలు తీర్చడం కోసం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, అర్హులైన పేదలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్ మాట్లాడుతూ అభివృద్ధిలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందినట్లు దేశం కూడా ప్రగతిపథంలో ముందుండాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వ ర్యంలో తాండూరు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నదన్నారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, నరేందర్రెడ్డి, రామలింగారెడ్డి, శకుంతల, ఉమాశంకర్, విఠల్నాయక్, వైస్చైర్మన్ వెం కట్రెడ్డి, ఎంపీటీసీలు, స ర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదర్శ నియోజకవర్గంగా తాండూరు : ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి సహకారంతో తాండూరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న తాండూరు ప్రస్తుతం రాష్ట్రంలోనే ఆదర్శంగా మారుతున్నదన్నారు. విద్యావైద్య రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. జిల్లా దవాఖానలో కార్పొరేట్కు దీటుగా మె రుగైన సేవలు ప్రజలకు అందుతున్నాయని, దీంతో రాష్ట్రంలోనే తాండూరు ప్రభుత్వ దవాఖాన మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో సంక్షో భం ఉండగా.. మన తాండూరులో సంక్షే మం ఉందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. తాండూరు బిడ్డగా రానున్న ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అందుకోసం ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు గ్రామాల్లోకి వస్తే ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించాలని సూచించారు.