వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ఆనంద్ హాజరయ్యారు. బుధవారం ఎమ్మెల్యేకు న్యాయవాదులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఇందులో భాగంగా కోర్టులో నీటి సమస్య ఉందని, బోర్లు మరమ్మతులకు వచ్చాయన్నారు. దుమ్ము దూళీ ఎక్కువగా వస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని న్యాయవాదులు తెలిపారు.
కార్యక్రమంలో వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్ పాల్గొన్నారు.