కొడంగల్ : ప్రజా ఆరోగ్యాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభ నెలకొన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరు అయిన రూ. 4లక్షల 23వేల విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్కుమార్, పర్సాపూర్ సర్పంచు సయ్యద్ అంజద్తో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.