వికారాబాద్ : నిరుపేదల పెండ్లిళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పెద్దన్నలా నిలుస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ధన్నారం, ఎన్నెపల్లి, శివారెడ్డిపేట, మద్గుల్చిట్టంపల్లి, రామయ్యగూడ, గెరిగెట్పల్లి తదితర కాలనీల్లో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా ఉండటానికే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలు చేశారన్నారు.
ఆడ పిల్లలు భారం కాకూడ దని పుట్టింటి నుంచి మెట్టినింటి వరకు ఆడ పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు నవీన్కుమార్, గోపాల్, ఆర్. నర్సింలు, నాయకులు సుభాన్రెడ్డి, గిరీష్కొఠారీ పాల్గొన్నారు.