పెద్దేముల్ : మండల కేంద్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు చిట్టెపు ప్రకాశ్రెడ్డి పార్టీ పటిష్టతకు, నిరుపేదలకు చేసిన సేవలు మరువలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఇటీవల కరోనా మహమ్మరితో మృతి చెందిన చిట్టెపు ప్రకాశ్రెడ్డి భార్య యశోదకు రూ. 4లక్షల 50వేల ఎల్ఓసీని స్థానిక నాయకులతో కలిసి ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చిట్టెపు ప్రకాశ్ రెడ్డి కరోనాతో మృతి చెందడం బాధకరమని, పార్టీ పటిష్టతకు, ఎంతోమంది పేదలకు ఆయన ఎనలేని సేవలు చేశారన్నారు. సీఎం సహాయనిధి ద్వారా ప్రత్యేక చొరవ తీసుకుని ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
అనంతరం ఆయన భార్య యశోదకు రూ. 4లక్షల 50వేల ఎల్ఓసీని అందించి, కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు. ఆయన వెంట సీనియర్ నాయకులు పురుషోత్తంరావు, టీఏల్డీఏ, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ నారాయణ రెడ్డి, ద్యావరి విష్ణువర్ధన్రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు నర్సింలు, కిషన్రావు, ప్రకాష్రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.