వికారాబాద్ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని కొత్రేపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ కాలనీలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కాలనీలోకి ఎవరుస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవచ్చని తెలిపారు. దొంగతనాలు, నేరస్తుల కదలికలు తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కాలనీలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.
అనంతరం వికారాబాద్ పట్టణంలోని 15వ వార్డులో బీటీ రోడ్డు పనులను వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పరిశీలించారు. నాణ్యతతో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు ప్రవళిక, అనంత్రెడ్డి, కృష్ణ, రామస్వామి, వికారాబాద్ సీఐ రాజశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.