కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పటెల్ చెరువుతండా గ్రామ పంచాయతీకి చెందిన సునితకిషోర్కు వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సహకారంతో లక్ష రూపాయల ఎల్వోసీని మంగళవారం మంచికుంట తండాలో లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శాంతితులసీరాం మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి సహాయం చేయడం అభినందనీయమన్నారు. దీనికి గాను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.