తలకొండపల్లి : మల్లప్పగుట్టపైకి వెల్లే ప్రధాన రహదారిపై స్వాగత తోరణానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన మల్లప్పగుట్ట మల్లికార్జున స్వామి దేవాలయానికి సూచికగా శ్రీనివాస్రెడ్డి రూ. 15లక్షల సొంత నిధులను వెచ్చించి స్వాగత తోరణం ఏర్పాటు చేయడం శుభ సూచికం అన్నారు.
అదే విధంగా తలకొండపల్లి మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ నర్సింహ సొంత నిధులతో నిర్మించిన స్వాగతతోరణాన్ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పాటు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు స్వప్న, లలిత, ఎంపీటీసీ వందన, హేమ, టీఆర్ఎస్ నాయకులు సత్తయ్య, మల్లేశ్, లక్ష్మీకాంత్, జంగయ్య, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.