వికారాబాద్, నవంబర్ 24 : ఆలోచన చేసి అభివృద్ధి చేసేవారికి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మద్గుల్చిట్టంపల్లి, గుడుపల్లి, ఎన్నెపల్లి, రామయ్యగూడ కాలనీల్లో పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం వారు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామంటే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
ప్రజా ఆశీర్వాద సభలో వికారాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ ఒకే విడతలో దళిత బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించడం చాలా అదృష్టం అన్నారు. స్థానికుడైన తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. డిగ్రీ కళాశాల, మెడికల్ కళాశాల, బ్రిడ్జి నిర్మాణానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, గోపాల్, సంతోష, కృష్ణ, నాయకులు నర్సింహులు, శ్రీనివాస్, మల్లేశం, సురేశ్ పాల్గొన్నారు.
మర్పల్లి: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మి మోసపోవద్దని వారి మాటలను నమ్మిమో సపోతే 24 గంటలు ఉన్న కరెంటును మూడు గంటలు చేస్తారని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా నీటిని అందించడంతో సమస్య తీరిందన్నారు. తెలంగా ణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు అందిస్తుంటే పక్కన ఉన్న కర్ణా టలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గంటలు అందిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే రైతుల పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి రూ.16 వేలకు పెంచ నున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళలందరికీ నెలకు రూ. మూడు వేల జీవన భృతి, ఆసరా పింఛన్లు రూ.5 వేలు, దివ్యాంగుల పింఛన్లను 6 వేలకు పెంచుతామన్నారు.
తెల్ల రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం సరఫరా, అర్హులైన పేద మహిళలకు నాలుగు వంద లకే గ్యాస్ సిలిండర్, రైతుబీమా విధంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వమే బీమా డబ్బులు చెల్లించి కేసీఆర్ బీమా రూ.5 లక్షలతో ప్రతిఇంటికి ధీమాగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్, ఎంపీపీ లలితా రమేశ్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్గుప్తా, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నాయబ్ గౌడ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధానకార్యదర్శి రాచయ్య, సీనియర్ నాయకులు శంకర్రెడ్డి, నరేశ్గౌడ్, మాజీ ఎంపీటీసీలు మల్లేశం, అశోక్, మాజీ సర్పంచ్ దాసుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, సంజీవ్, మొగులయ్య, ప్రవీణ్ యాదవ్, ప్రకాశ్, సాయి, రామ్ లక్ష్మణ్, సుభాన్, నర్సింహులు, బలవంత్రెడ్డి ఆయా గ్రామాల సర్పంచు లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.