వికారాబాద్ : విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులు అన్ని హాస్టళ్లకు తాగునీటిని అందించాలని తెలిపారు. పోస్ట్మెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనాల ఏర్పాటు కోసం కృషి చేద్దామన్నారు.
నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొని, విద్యార్థులకు సౌకర్యాలు కల్పిద్దామని వివరించారు. కార్యక్రమంలో డీఎస్సీడీవో మల్లేశం, డీటీడీవో కోటాజీ, డీబీసీడీవో పుష్పలత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.