ధారూరు : గ్రామాల్లో రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ కాలంలో ఎలాంటి పంటలను సాగు చేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని ఆలోచించి పంటలను సాగుచేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతులకు అవగాహన కల్పించారు. బుధవారం ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో రూ. 22లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు వేదికను, గ్రామ సమీపంలోని కోట్పల్లి ప్రాజెక్టు అలుగుపై రూ. 50లక్షలతో నూతనంగా నిర్మించిన వంతెనలను ప్రారంభించారు. అంతకు ముందు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ కాలంలో ఎలాంటి పంటలు వేయాలి, ఏలాంటి ఎరువులు ఉపయోగించాలి పంట అధిక ఉత్పత్తులు ఎలా రాబట్టాలి అనే వివిధ అంశాలపై రైతులు చర్చించుకోవడానికి ఈ రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతయన్నారు. రైతులకు మార్కెట్ యార్డులోనే గిట్టుబాటు ధర లభిస్తుందని దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించాలని, రైతులు ఒకే దగ్గర గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి, జడ్పీటీసి కోస్నం సుజాత, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, గ్రామ సర్పంచ్ చంద్రకళ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, కార్యదర్శులు అంజయ్య, రాజుగుప్త, ఏఎంసీ చైర్మన్ సంతోష్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, మండల రైతు సమన్వయ కమిటీ కో-అర్డినేటర్ రుద్రారం వెంకటయ్య, వ్యవసాయ అధికారి జ్యోతి పాల్గొన్నారు.