షాబాద్ : భారీ వర్షాలతో తరుచుగా వస్తున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఎస్ఎన్డీపీ ఎస్ఈతో బుధవారం మంత్రి తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి, బడంగ్పేట్, మీర్పేట్ పరిధిలో చేపట్టనున్న పలు పనులపై చర్చించారు. ఆకాల వర్షాల కారణంగా ఏర్పడ్డ ఇబ్బందులను జల్పల్లితో పాటు మీర్పేట్లో పర్యటించి తెలుసుకున్న మంత్రి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను వెంటనే ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభించాలని సూచించారు.
ఎస్ఎన్డీపీ పరిధిలో మెట్రో సిటీ, డ్రీం సిటీ, గ్రీన్ సిటీ, నబీల్ కాలనీల సంబంధిత పనులకు అనుమతులు వచ్చే నెల 5వ తేది లోపు ఇవ్వాల్సిందిగా, 10వ తేది లోపు టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు గాను 385 మీటర్ల పొడవుతో 3/3మీటర్ల సామర్థ్యం గల అండర్గౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.