వికారాబాద్ : ఆర్టీవో కార్యాలయం ఎదుట రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు చెందిన దిపక్ కుమార్ (26) బైక్పై వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. వికారాబాద్ ఆర్టీవో కార్యాలయ సమీపంలో వికారాబాద్ వైపు వేగంగా వస్తున్నకారు బలంగా ఢీకొట్టింది.
దీంతో బైక్ పై ఉన్న దిపక్కుమార్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.