వికారాబాద్ : రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తూ దేశ రైతాంగానికి మార్గదర్శకంగా సీఎం కేసీఆర్ నిలిచారని సబితాఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సబితాఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు టేకులబీడు తండాలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కోసం రైతుబీమా, రైతుబంధు పథకాలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి పరుస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రాజ్య స్థాపనకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా రైతులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, కౌన్సిలర్ సంతోష నర్సింలు, రైతులు పాల్గొన్నారు.