కులకచర్ల : తెలంగాణ రాష్ట్రంలో నేడు రైతులు నిజమైన పండుగ జరుపుకుంటున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం డాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా గ్రామానికి చెందిన రైతులు, కూలీలలు, కులకచర్ల, డాపూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, సత్తినేని సుధాకర్రెడ్డిల ఆధ్వర్యంలో వరి పొలాల్లో వరినాట్లు వేసి రైతుబంధు సంబురాలు సంబురంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేశారని తెలిపారు. నేడు రైతులకు నిజమైన పండుగలా ఉందన్నారు. ఈ సందర్భంగా వీరాపూర్ వ్యవసాయ పొలంలో రైతులు, కూలీలతో పాటు వరినాట్లు వేసిన రైతులకు మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ డాపూర్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, కులకచర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, డాపూర్ ఎంపీటీసీ శంకర్, కులకచర్ల మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్, వీరాపూర్ గ్రామ సర్పంచ్ జనార్దన్రెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహులు, డాపూర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజయ్య పాల్గొన్నారు.