కేశంపేట, మే 17 : కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం వేంకటేశ్వరస్వామి-లక్ష్మీదేవి-అలివేలు మంగాదేవిల కల్యాణాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కుటుంబసభ్యులు వైభవంగా జరిపించారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను దేవాలయానికి మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం దేవతలకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్-లక్ష్మమ్మ, ఎంపీపీ రవీందర్యాదవ్-సర్పంచ్ కవిత దంపతులు పట్టువస్ర్తాలను సమర్పించారు.
పురోహితులు కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కేశంపేట జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, సర్పంచ్లు నవీన్కుమార్, వెంకట్రెడ్డి, కృష్ణయ్య, ఏసీపీ కుశాల్కర్, సీఐలు రామయ్య, బాల్రాజ్, నవీన్, వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు మురళీయాదవ్, మురళీధర్రెడ్డి, గోపాల్రెడ్డి, పల్లె నర్సింగ్రావు, యాదగిరిరావు, విశ్వనాథం పాల్గొన్నారు.