సరైన సమయంలో టీకాలు వేయించాలి
పశు వైద్యుల సూచనలు పాటించాలి
మొయినాబాద్, జూలై 14: మూగ జీవాలను సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాల ని పశు వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో భూమిపై కొత్త గడ్డి వస్తుందని, ఆ గడ్డిని తినడం ద్వారా అవి రోగాల బారిన పడుతాయన్నారు. అందువల్ల జీవాలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక టీకాలను వేయించాలన్నారు.
చిటుకు వ్యాధి..
ఈ వ్యాధి సోకితే గొర్రెలు మరణించే అవకాశం ఉంటుంది. చనిపోయే ముందు అవి గిలగిలా కొట్టుకుంటూ గాలిలో ఎగిరి కిందపడిపోతా యి. ఈ వ్యాధి నివారణకు నాలుగు నెలలు పైబడిన గొర్రె పిల్లలకు ప్రతి ఏడాది మే నెలలో చిటుకు వ్యాధినివారణ టీకాలను వేయించాలి.
దొమ్మరోగం..
ఈ వ్యాధిని నేరుడు రోగం అని కూడా పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ వ్యా ధి సోకిన గొర్రెల్లో 105 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది. జీవాలు ఆరోగ్యంగా ఉంటూనే ఆకస్మికంగా చనిపోయే అవకాశం ఉంటుంది. ముక్కు, నోరు, చెవుల ద్వారా నల్ల టి రంగులో రక్తం కారుతుంది. ఈ వ్యాధి నివారణకు ఆంత్రాక్స్ స్పోర్ వ్యాక్సిన్ వేయించాలి.
గాలికుంటు వ్యాధి..
ఈ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. సోకిన జీవాల్లో నోరు, నాలుక, గిట్టల మధ్య భాగంలో బొబ్బ లు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం ఉంటుంది. జీవాలు బలహీనపడి మృత్యువాత పడతాయి. దీని నివారణకు ప్రతి ఏడాది మార్చిలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.
కాలిపుండ్ల వ్యాధి..
ఈ వ్యాధి సూక్ష్మజీవుల వల్ల సోకుతుంది. ఇది సోకిన జీవాల్లో రెండు గిట్టల మధ్య చర్మం ఉబ్బిజీవాలు కుంటుతుంటాయి. చీము కారు తూ చెడు వాసన వస్తుంది. దీని నివారణకు యాంటిబయోటిక్ మందులు వాడితే ఫలితం ఉంటుంది.
బొబ్బర వ్యాధి..
ఇది వైరస్ వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. రెండు రోజుల్లో వెంట్రుకలు లేచి శరీరంపై దద్దుర్లు ఏర్పడుతాయి. బొబ్బలుగా మారి చీము పడుతుంది. అది నలుపు రంగులోకి మారి చనిపోతాయి. దీని నివారణకు ఏటా నవంబర్లో బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి
నీలి నాలుక..
దీనిని మూత వాపు వ్యాధి అని కూడా అంటా రు. ఇది వైరస్ వల్ల వ్యాపిస్తుంది. సెప్టెంబర్, డిసెంబర్ మధ్యన ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన జీవాల్లో జ్వరం అధికంగా ఉంటుంది. నోరు, నాలుక ఎర్రబడి పైపొర లేచిపోయి పుండ్లుగా మారతాయి. ఈ వ్యాధి సోకిన జీవాలకు యాంటిబయోటిక్ మందులు వాడాలి
ముసర వ్యాధి..
వైరస్ వల్ల వా వ్యాధి సోకుతుంది. మొదట జ్వరంతో ఈ వ్యాధి లక్షణాలు మొదలవుతా యి. జీవాలు దగ్గుతూ ఉంటాయి. నోటిలో పుండ్లు ఏర్పడుతాయి. తద్వారా మేత తినక మృత్యువాత పడతాయి. దీని నివారణకు జనవరిలో జీవాలకు పేపీఆర్ టీకా వేయించాలి.
జాగ్రత్తలు తీసుకోవాలి
జీవాల ఆరోగ్యం విషయం లో పెంపకందారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. గొర్రెలు, మేకల్లో బొబ్బ, గాలికుంటు వ్యాధి, నీలి నా లుక వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జీవాలకు సంక్రమిస్తున్న వ్యాధుల నివారణకు అధికారుల సలహాలు, సూచనలు పాటించారు. ముందస్తుగా టీకాలను వేయించాలి.
– డాక్టర్ శ్రీలత, మొయినాబాద్