గత బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. టీఎస్ఐపాస్తో అనతికాలంలోనే అనుమతులిచ్చి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నో చిన్న, భారీ తరహా పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. అయితే చిన్న పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలు చేసే బయ్యర్లు డబ్బులు చెల్లించక పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలతో కలిపి గత ప్రభుత్వం రంగారెడ్జి రీజియన్ కౌన్సిల్(టీఎస్ఎంఎస్ఈఎఫ్సీ)ను ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలకు చేయూతనందించింది.
సమస్య ఏదైనా కోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సామరస్యంగా 90 రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నది. బయ్యర్లు, పారిశ్రామిక వేత్తలకు కౌన్సిల్ వారధిగా నిలుస్తూ మొండి బకాయిలను ఇప్పించి చిన్న పరిశ్రమలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్ ద్వారా 753 కేసులు పరిష్కారం కాగా, రూ.474.51కోట్లను బయ్యర్లు పరిశ్రమలకు చెల్లించారు. అనతికాలంలోనే అత్యధిక కేసులను పరిష్కరించిన రంగారెడ్డి ఫెసిలిటేషన్ కౌన్సిల్ జాతీయస్థాయిలో ఆరో స్థానంలో నిలువడం గమనార్హం.
– రంగారెడ్డి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (టీఎస్ఎంఎస్ఈఎఫ్సీ) సత్ఫలితాలను ఇస్తున్నది. బయ్యర్ల నుంచి రావాల్సిన మొండి బకాయిలను పారిశ్రామికవేత్తలకు ఇప్పిం చి చిన్న పరిశ్రమలకు చేయూతనందిస్తున్నది. సమస్య కోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సామరస్య పూర్వకంగా 90 రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నది. అనతికాలంలోనే అత్యధిక కేసులను పరిష్కరించిన రంగారెడ్డి ఫెసిలిటేషన్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్ 753 కేసులను పరిష్కరించి రూ.474.51కోట్లను బయ్య ర్లు పరిశ్రమలకు చెల్లించేలా చర్యలు తీసుకున్నది.
ఉత్పత్తులకు సంబంధించిన చెల్లింపులను బయ్య ర్లు చెల్లించకపోవడంతో చిన్న పరిశ్రమలు నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది. మొండి బకాయిలతో పరిశ్రమలను నడపలేక మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల నుంచి చిన్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభు త్వం 2018 సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువన గిరి, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో టీఎస్ఎంఎస్ఈఎఫ్సీని ఏర్పాటు చేసింది.
తెలంగాణకు ముందు ఒకే ఒక్క కౌన్సిల్ ఉండగా.. పెరిగిన సమస్యల దృష్ట్యా బీఆర్ఎస్ ప్రభుత్వం కౌ న్సిళ్లను విస్తరించడం చిన్న పరిశ్రమలకు మరింత మేలు చేకూర్చింది. ప్రతి కౌన్సిల్కు పరిశ్రమల శా ఖ అదనపు కార్యదర్శి స్థాయి అధికారిని చైర్మన్గా నియమించి జ్యుడీషియల్ పవర్స్ను కల్పించిం ది. పరిశ్రమల నుంచి వచ్చే దరఖాస్తులను ఈ కౌ న్సిళ్లు గరిష్ఠంగా 90 రోజుల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నాయి. ఒకవేళ కౌన్సిల్ ఇచ్చిన తీర్పుపై బ య్యర్లు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే… కౌ న్సిల్ ఇచ్చిన తీర్పు ప్రకారం చెల్లించాల్సిన మొ త్తంలో 75 శాతం కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ ఐ పాస్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అద్భుతాలను సృష్టిస్తున్నది. అన్నీ సజావుగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతులొచ్చేస్తున్నాయి. రవాణా సదుపాయాలు మెరుగుపడడం.. శాంతి భద్రతల స మస్యలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు గ్రా మీణ జిల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా.. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిన రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక ప్రభ నేడు వెలిగిపోతున్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎ న్నింటికో జిల్లా ఆకర్షణీయ గమ్యస్థానమైంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో కేవలం రూ.3,328 కోట్ల పెట్టుబడులతో 2,777 పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయి. అప్పట్లో కేవలం 45,763 మందికి మాత్రమే ఉ పాధి కల్పించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో ప్రస్తుతం జిల్లాలో రూ.47 వేల 62 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమల ఏర్పాటు ద్వారా 5,15,851 మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఫాక్స్ కాన్ తదితర పెద్ద పెద్ద కంపెనీలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు తరలివచ్చాయి.
టీఎస్ఎంఎస్ఈఎఫ్సీ రంగారెడ్డి రీజియన్ కౌ న్సిల్ కేసుల పరిష్కారంలో ముందంజలో ఉం టూ వస్తున్నది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నా గర్కర్నూల్, నారాయణపేట జిల్లాలతో కలిపి గ త ప్రభుత్వం రంగారెడ్జి రీజియన్ కౌన్సిల్ను ఏ ర్పాటు చేసింది. గడిచిన ఐదేండ్ల కాలంలో ఈ రీజియన్కు బకాయిల విషయమై పరిశ్రమల నుంచి 1,960 దరఖాస్తులు వచ్చాయి. ఈ మే రకు కౌన్సిల్ బయ్యర్ల నుంచి రావాల్సిన మొం డి బకాయిలను సత్వరమే ఇప్పించేందుకు 92 సమావేశాలను నిర్వహించింది.
వివిధ కారణాలతో 700 దరఖాస్తులను కౌన్సిల్ తిరస్కరించింది. మరో 753 దరఖాస్తులను పరిష్కరించి రూ.474.51కోట్ల బకాయిలను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపింది. కేసుల సత్వర పరిష్కారానికి కౌన్సిల్ చేపట్టిన చర్యలు చిన్న పరిశ్రమలకు గొప్ప ఊరటనిచ్చాయి. రంగారెడ్డి రీజియ న్ కౌన్సిల్ 2021-22 ఏడాదికి ఔట్ పెర్ఫార్మింగ్ విభాగంలో జాతీయస్థాయిలో అవార్డు ను పొందింది. 74.13 శాతం దరఖాస్తుల పరిష్కారంతో ప్రస్తుతం రంగారెడ్డి రీజియన్ కౌన్సి ల్ జాతీయస్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కౌన్సిల్తో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎంతో మేలు కలుగుతున్నది. రంగారెడ్డి రీజియన్ పరిధిలో అత్యధిక సమావేశాలను నిర్వహించి బయ్యర్లు, పరిశ్రమల నిర్వాహకుల మధ్య రాజీ కుదిర్చి అత్యధిక దరఖాస్తులను పరిష్కరించాం. గతేడాది జాతీయ స్థాయిలో అవార్డును సాధించడంతోపాటు, ప్రస్తుతం జాతీయ స్థాయిలో కేసుల పరిష్కారంలో 6వ స్థానంలో ఉన్నాం. ఇది కౌన్సిల్లోని అందరి సభ్యుల సమష్టి విజయం.
– రాజేశ్వర్ రెడ్డి, చైర్మన్, ఫెసిలిటేషన్ కౌన్సిల్, రంగారెడ్డి రీజియన్