యాచారం, సెప్టెంబర్7: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన 30 మంది ఎమ్మెల్యే కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డిమాట్లాడుతూ..మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. రాష్ర్టాభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించినంతమాత్రాన ఒరిగేదేమిలేదన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలనుంచి యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో పేదల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్ నరేందర్, టీఆర్ఎస్ నాయకులు శంకర్నాయక్, యాదయ్య తదితరులున్నారు.