సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి పంచిపెట్టారు. బాణాసంచా పేల్చారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ మండలాల్లో మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. సీఎం జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్యాదవ్, కాలె యాదయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17 తెలంగాణ రాష్ట్రం సాధించి దశ, దిశను మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్, ఎంపీపీ, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సహకార సంఘం చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున కేక్ కట్చేసి సంబురాలు జరుపుకున్నారు. మంచాల మండల కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. మండలంలోని దండుమైలారం, తులేకలాన్, పోల్కంపల్లి, రాయపోల్, ఎలిమినేడు, ఉప్పరిగూడ, పోచారం, కప్పాడు, తుర్కగూడ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామంలో సర్పంచ్ చిలుకల యాదగిరి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి మహిళా సంఘాలతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కళమ్మ, కోఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్గౌడ్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యాచారం మండల కేంద్రంలోని సయ్యద్ అబాద్షా దర్గాలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, జడ్పీటీసీ జంగమ్మ ఆధ్వర్యంలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. నందివనపర్తి తదితర గ్రామాల్లో కేక్ కట్ చేశారు. మంచాల మండల కేంద్రంలో ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల వద్ద కేక్ కట్చేశారు. తుర్కయాంజాల్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు కిషన్గౌడ్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్ల ఆధ్వర్యంలో, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు.
షాబాద్, ఫిబ్రవరి 17: పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని ఆలూర్ ప్రభుత్వ దవాఖానలో కేక్ కట్ చేశారు. మొయినాబాద్ మండలం చిలుకూరు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. చేవెళ్ల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. షాబాద్ మండలం చందనవెళ్లిలో ప్రభుత్వ దవాఖానలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సింగాపురం శివాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, కాలె శ్రీకాంత్, మర్పల్లి మాలతీ, గోవిందమ్మ, ఎంపీపీలు ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, నక్షత్రం, గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ అధ్యక్షులు నర్సింగ్రావు, ప్రభాకర్, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్చేసి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, వృద్ధులకు దుప్పట్లను వితరణ చేశారు. ఆమనగల్లు, కడ్తాల మండలంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావు, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, కడ్తాల్ జడ్పీటీసీ దశరథ్నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు పరమేశ్, ఎంపీటీసీ లచ్చీరాంనాయక్, తలకొండపల్లి మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
షాద్నగర్ : ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ మున్సిపాలిటీతో పాటు కొందుర్గు, కొత్తూరు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, నందిగామ, కేశంపేట మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కేక్ను కట్ చేసి అభిమానులకు పంచారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. షాద్నగర్ సర్కారు దవాఖాన ఆవరణలో ఎమ్మెల్యే కేక్ను కట్ చేసి మొక్కలు నాటారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొత్తూరు మండల కేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కేక్ కట్ చేశారు.
నందిగామ మండల కేంద్రంలో మొక్కలు నాటారు. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాధిక్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ రవీందర్యాదవ్ ఆధ్వర్యంలో, చౌదరిగూడ మండల కేంద్రంలో సంబురాలు జరుపుకున్నారు. ఫరూఖ్నగర్ మండ లం ఎలికట్ట గ్రామంలోని భవానీ మాత దేవాలయంలో టీఆర్ఎస్వీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.