ఆమనగల్లు : టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కంకణ బద్దులు కావాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వేళ్తున్న పార్టీకి అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. పార్టీపై బురదజల్లే విధంగా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు చేస్తే వాటిని ధీటుగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్నాయక్, సింగిల్విండో చైర్మన్ తిరుమల్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జైపాల్రెడ్డి, సర్పంచులు, డైరెక్టర్లు కృష్ణారెడ్డి, సుభాశ్, నిరంజన్, నాయకులు పాల్గొన్నారు.